ఆదివారం నాడు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి… ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది.
అయితే లాస్ట్ ఓవర్ లో నాలుగో బంతి నో బాల్ అని ఎంపైర్ ప్రకటించటం మ్యాచ్ మొత్తానికి టర్న్ పాయింట్ అయింది.కానీ అదే బాల్ నీ కోహ్లీ సిక్స్ కొట్టాడు.
ఆ తర్వాత ఫ్రీ హిట్ రావడం కోహ్లీ.బౌల్డ్ కావడం జరిగింది.

ఇదే సమయంలో దినేష్ కార్తీక్ మరియు కోహ్లీ 3 పరుగులు చేయడం జరిగింది.బౌల్డ్ అయిన బాల్ కి మూడు పరుగులు చేయడంతో వివాదం నెలకొంది.కాగా క్రికెట్ ప్రపంచంలో ఈ వివాదం కొనసాగుతున్న వేళ దీనిపై ప్రముఖ అంపైర్ సైమన్ టౌఫెల్ స్పందించాడు.అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు అనేకసార్లు ఎంపైరింగ్ చేసి.ఎంతో పేరు సంపాదించిన టౌఫెల్ సోషల్ మీడియాలో వివాదం పై మాట్లాడుతూ “నన్ను చాలామంది దీని గురించి అడిగారు.కానీ ఇందులో ఎలాంటి తప్పిదం లేదు.
అంపైర్ లు సరైన నిర్ణయం తీసుకున్నారు.బాల్ స్టంప్స్ కి తగిలి వెళ్తే అది డెడ్ బాల్ కాదు.
రన్స్ నీ బైస్ గా ప్రకటించటం కరెక్టే అని టౌఫెల్ క్లారిటీ ఇవ్వటం జరిగింది.







