T20 వరల్డ్ కప్ టోర్నీలో నిన్న పాకిస్తాన్ పై భారత్ గెలవటం తెలిసిందే.ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇండియా గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
చివరి బాల్ వరకు విజయం రెండు జట్ల మధ్య ధోబూచులాటాడింది.కానీ చివరి బంతికి విజయం భారత్ నీ వరించటంతో క్రికెట్ ప్రేమికులు ముందుగానే దీపావళి పండుగ చేసుకున్నారు.
విరాట్ కోహ్లీ ఆడిన ఆట తీరుపై ప్రపంచవ్యాప్తంగా పలు సెలబ్రిటీలు ఇంకా దేశంలో రాజకీయ నాయకులు అభినందనలు తెలియజేశారు.
క్రికెట్ చరిత్రలోనే నిన్నటి జరిగిన భారత్- పాక్ మ్యాచ్ మర్చిపోలేనిది అని ప్రశంసించారు.
అయితే మరోపక్క పార్క్ క్రికెట్ అభిమానులు భారత్ గెలవడం పట్ల సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తూ వెరైటీ కామెంట్లు పెట్టడం జరిగింది.కొంతమంది ఆవేశానికి లోనయి టీవీలు కూడా పగలగొట్టారు.
ఈ క్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ లో వరుస ట్వీట్ లతో చెలరేగిపోవటం జరిగింది.దీపావళి పండుగ నేపథ్యంలో సుందర్ పిచాయ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి మ్యాచ్ చివరి మూడు ఓవర్ల గురించి ప్రస్తావించారు.
దీంతో ఓ పాకిస్తాన్ అభిమాని మొదటి మూడు ఓవర్లు చూడామని కాస్త ఎటకారంగా రిప్లై ఇవ్వడం జరిగింది.ఇక ఇదే తరహాలో సుందర్ పిచాయ్. సదరు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికుడికి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చాడు.కచ్చితంగా అది కూడా చూశాను.భువి, అర్షదిప్ లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశారు అని ఊహించని కౌంటర్ ఇచ్చాడు.దీంతో సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.