మహారాష్ట్రలోని లాతూరులోని భారీ చోరీ

మహారాష్ట్రలోని లాతూరులోని భారీ చోరీ జరిగింది.మారణాయుధాలతో ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.2.25 కోట్ల నగదు, 2.4 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు.ఈ నెల 12న స్థానిక కన్నయ్య నగర్‌లోని కాట్పూరు రోడ్డులో ఈ ఘటన జరిగింది.

 Massive Theft In Latur, Maharashtra-TeluguStop.com

రాజ్‌కుమార్ అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లోకి తుపాకి, ఇతర మారణాయుధాలతో ప్రవేశించిన నలుగురు దుండగులు నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు.ఈ భారీ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు.

వారి కోసం పూణె, జల్నా, లాతూర్‌లలో గాలించి అదుపులోకి తీసుకున్నట్టు అదనపు ఎస్పీ అనురాగ్ జైన్ తెలిపారు.వారి నుంచి రూ.50 లక్షల నగదు, రూ.29 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube