మాదాపూర్ లో గన్ తో హల్చల్ కేసులో దర్యాప్తు వేగవంతం అయింది.స్థలం కాంట్రాక్టర్ సుబ్బయ్యను సంజీవ రెడ్డి అనే వ్యక్తి గన్ తో బెదిరించాడని పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో సంజీవ్ రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీుకున్నారు, సర్వే నెంబర్ 10లో రామకృష్ణారెడ్డికి 2550 గజాల స్థలం ఉంది.అది గత 13 ఏళ్లుగా ఆయన ఆధీనంలో నే ఉందని సుబ్బయ్య తెలిపాడు.
ప్రహరీ గోడ కూలిపోవడంతో తిరిగి నిర్మిస్తున్నాడు రామకృష్ణారెడ్డి.అయితే ఈ స్థలానికి ఆనుకుని నిర్మాత దగ్గుబాటి సురేశ్ కు నాలుగు గుంటల భూమి ఉంది.
సురేశ్ బాబు స్థలంలో ప్రహరీ నిర్మిస్తున్నారని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు.తర్వాత నిర్మాణ ప్రాంతనికి వెళ్లి పనులు ఆపేయాలని సంజీవ రెడ్డి బెదిరింపులకు దిగాడు.
కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం వలనే సంజీవ రెడ్డి బెదిరిస్తున్నాడని సుబ్బయ్య ఆరోపిస్తున్నాడు.