తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు రద్దీ నిత్యం సర్వసాధారణం.ఈ నేపథ్యంలో నేడు తిరుమల శ్రీవారి దర్శనం కి కొనసాగుతున్న రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
ఇప్పటికే నిన్న శ్రీవారిని 72,243 మంది భక్తజనం దర్శించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్ల రూపాయలు.రద్దీ కారణంగా విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీస్ సిబ్బంది, టీటీడీ సిబ్బంది భక్తులకు కావాల్సిన సహాయం చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు అందుబాటులో ఉంటున్నారు.







