నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తూ జనాలను మోసం చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్లో ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు.
అనంతరం నిందితుల నుంచి ఫేక్ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సుమారు రూ.4 కోట్ల విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు.ఇలాంటి వాళ్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు అధికారులు సూచించారు.