త్వరలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో మహిళలపై అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వరాల జల్లలు కురిపించింది.ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన (ఎమ్డిఎస్వై) కింద 1.35 కోట్ల మంది మహిళలకు మూడేళ్ల పాటు ఇంటర్నెట్ కనెక్షన్తో కూడిన ఉచిత మొబైల్ ఫోన్లను అక్టోబర్ నుండి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో, సమాచార సాంకేతిక శాఖను కలిగి ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ తరపున విద్యాశాఖ మంత్రి బిడి కల్లా సమాధానమిచ్చారు.ఈ ప్రయోజనం కోసం 2300 కోట్ల రూపాయల అనుబంధ బడ్జెట్ డిమాండ్ను మంగళవారం సభ ఆమోదించిందని చెప్పారు.
దీంతో చిరంజీవి పథకం కింద కుటుంబ పెద్దలుగా నమోదైన మహిళలకు స్మార్ట్ఫోన్ల పంపిణీకి మార్గం సుగమమైంది.
ఇప్పటికే, బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించామని, ఇది స్మార్ట్ఫోన్ల ఉచిత పంపిణీ యొక్క మొదటి దశ లేదా మొదటి సంవత్సరం లక్ష్యాన్ని చేరుకోవడానికి మొత్తం రూ.3500 కోట్లకు చేరుకుందని మంత్రి బీడీ కల్లా తెలిపారు.ఈ పథకం కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.12,000 కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారా, ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్ మూడేళ్లుగా విస్తరించిన పథకంపై సభలోని లబ్ధిదారుల సంఖ్యపై అనుమానం వ్యక్తం చేశారు.మే 16న ఈ పథకం కింద టెండర్లను ఆహ్వానించినట్లు కల్లా తెలియజేశారు.
దీని తర్వాత ఆగస్టు 17న సాంకేతిక టెండర్, సెప్టెంబర్ 8న ఫైనాన్షియల్ టెండర్లు జరిగాయని, ఈ ఫోన్లలో వినియోగదారులకు ప్రభుత్వ పథకాలు, ఇ- సమాచారం అందించే అప్లికేషన్లు ఉంటాయని తెలిపారు.

ఈ పథకం లక్ష్యాన్ని కోరుతూ ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి కల్లా లిఖితపూర్వక సమాధానం అందించారు.సంక్షేమ పథకాల గురించి సమాచారం అందించడం,అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సౌకర్యాల ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.ఇవన్నీ ఎన్నికల హామీలని, మహిళల ఓట్ల కోసమే ప్రభుత్వం ఇలా చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ఈ పథకంపై మాత్రం మహిళలు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఉచితంగా స్మార్ట్ ఫోన్ ఇచ్చి, దానికి ఉచితక కాలింగ సదుపాయం, మూడేళ్లు ఉచిత ఇంటర్నెట్ అంటే ఖచ్చితంగా సామాన్యులకు అది శుభవార్తేనని చెప్పాలి.