మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఢిల్లీ బయల్దేరిన ఓ విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్ కలకలం సృష్టించింది.దీంతో అప్రమత్తమైన CISF ఢిల్లీ ఎయిర్పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేసి, విస్తృత తనిఖీలు చేపట్టారు.
అయితే ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు కన్పించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.







