సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రమాణాలు చేయించుకొని ఓట్లు వేయించుకునే చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు.
ప్రతి ఉపఎన్నికలో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.పట్టభద్రుల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో రూ.870 కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు.డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.