గుంటూరులో టీడీపీ మీడియా సమన్వయ కర్త దారపనేని నరేంద్రను సీబీ సీఐడీ కోర్టు ఎదుట హజరుపరిచారు.ఈ నేపథ్యంలో ఆయనను తరలిస్తుండగా మార్గమధ్యలో వారి వాహనాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.
అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
అనంతరం సీబీ సీఐడీ కోర్టులో న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు నరేంద్రను జడ్జి నివాసానికి తరలించారు.