ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్ట్ చేసిన బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు మరో రెండు రోజులపాటు కస్టడీని పొడిగించారు.ఇప్పటికే మూడు రోజులపాటు విచారించిన న్యాయస్థానం పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.