అమరావతిలో బీసీల పథకాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టామన్నారు.నామినేటెడ్ పదవిలో 50 శాతమని పెట్టుకున్నా.
రిజర్వేషన్ వీలైతే 60 శాతం అమలు చేయాలని సీఎం చెప్తున్నారు అని వెల్లడించారు.ఇదంతా ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఉంటే కూడా సాధ్యమయ్యేది కాదన్నారు.యూపీ, బీహార్ లో కూడా 50 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదన్న సజ్జల.2029 ఎన్నికల నాటికి బీసీల నాయకత్వం పెరుగుతుందని పేర్కొన్నారు.చంద్రబాబు బీసీలను కేవలం ఓట్ బ్యాంకు గానే చూస్తారని విమర్శించారు.ఓట్ల కోసం వైసిపి చౌకబారు రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు.







