కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ లు సరోగసి ద్వారా పిల్లలను కన్న విషయం తెలిసిందే.ఇదే విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించడంతో వార్త కాస్త టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ చిన్నారుల పాదాలను తాగుతూ నయనతార, విగ్నేష్ శివన్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విషయాన్ని తెలిసిందే.ఇక ఇది ఇలా ఉంటే వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు అన్న మాట విని చాలామంది షాక్కు గురయ్యారు.
ఎందుకంటే వారికి పెళ్లయి నాలుగు నెలలకే ఎలా పిల్లలు పుట్టారు కడుపు ఎలా వచ్చింది.అంటే నయనతార పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందా అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ విషయం పట్ల నెటిజెన్స్ కి అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ పేమ్ కస్తూరి శంకర్ స్పందించింది.
టూరిశంకర్ స్పందిస్తూ సరోగసి చట్ట వ్యతిరేకం అంటూ పోస్ట్ చేసింది.జనవరి 2022 నుంచి అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం ఇండియాలో సరోగసిపై నిషేధం విధించారు.

వైద్యపరంగా అత్యవసరమైన కారణాలకు తప్ప సరోగసిని ప్రోత్సహించకూడదు.ఈ విషయం గురించి మనం ముందు ముందు చాలా వినబోతున్నాం అంటూ కస్తూరి శంకర్ ట్విట్ చేసింది.అయితే కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది కానీ అక్కడ నయనతార దంపతుల పేర్లు మాత్రం ప్రస్తావించలేదు.ప్రస్తుతం నయనతార విగ్నేష్ శివన్న విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలోనే కస్తూరి శంకర్ ఆ విధంగా సరోగసీ గురించి కామెంట్స్ చేయడంతో ఆమె వారిని ఉద్దేశించే ట్విట్ చేసింది అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
స్పందించిన కస్తూరి శంకర్ తాను సరోగసి చట్టం గురించి ట్వీట్ చేస్తే మీరు నయనతార విగ్నేష్ దంపతులకు లింక్ చేసి తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని వీళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను పరువు నష్టం దావా కూడా వేస్తాను అంటూ హెచ్చరిక చేస్తూ మరొక ట్వీట్ ని కూడా చేసింది కస్తూరి శంకర్.







