శ్రీలంక నుంచి రామేశ్వరం వరకు సముద్రంలో ఈదుతూ వెళ్లిన యువకుడు

శ్రీలంకకు చెందిన ఓ యువకుడు సముద్రంలో దూకి 13 కిలోమీటర్లు ఈదుకుంటూ మొత్తానికి తమిళనాడు తీరానికి చేరుకున్నాడు.అతడి సాహసానికి, గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.

 A Young Man From Sri Lanka Reached Rameswaram Which Is 13 Kilometers In The Sea-TeluguStop.com

కానీ, అతడు అక్రమంగా భారత్‌లో ప్రవేశించడంతో తీర గస్తీదళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.శ్రీలంక నుంచి ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి ఓ పడవలో తమిళనాడుకు బయలుదేరాడు.

తమిళనాడు తీరానికి చేరుకునే క్రమంలో సముద్రంలో దూకేసిన 24 ఏళ్ల ఆ యువకుడు ఆ తర్వాత 13 కిలోమీటర్లు ఈది రామేశ్వరం తీరానికి చేరుకున్నాడు.అతడిని అదుపులోకి తీసుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు అతడి నుంచి గడువు ముగిసిన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.

శ్రీలంకలోని తలైమన్నారుకు చెందిన హసాన్ ఖాన్ అలియాస్ అజయ్ అలియాస్ ఖాన్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి బోటులో వచ్చినట్టు గుర్తించారు.వారితో పాటు మరో వ్యక్తి కూడా వచ్చాడని, అందరినీ రామనాథపురం జిల్లా మండపం క్యాంపునకు తరలించినట్టు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube