ఆదిపురుష్ సినిమాకు కష్టాలు వీడటం లేదు.ఈ మూవీ టీజర్ విడుదల అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఇటీవల ఈ సినిమా రిలీజ్ పై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం హీరో ప్రభాస్ సహా చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేసింది.ఈ సినిమాను ఓం రౌత్ దర్శకత్వంలో సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుని పాత్రలో దేవదత్త నాగే నటిస్తున్నారు.







