బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సంస్థ, దర్శకుడు అనిల్ కడియాలను, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సంస్థను ఈటీవి మొదటి నుండి ఎంతో సపోర్ట్ చేస్తూ ఎన్నో ఈ విషయాలను బ్లాక్ బస్టర్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి సరికొత్త షో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ క్రమంలోనే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ నుంచి ఇదివరకే ఆలీతో సరదాగా, పాడుతా తీయగా,స్వరాభిషేకం వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే త్వరలోనే సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఈటీవీలో మిస్టర్ అండ్ మిసెస్ అనే సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారు.అక్టోబర్ 11వ తేదీ ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం కానుంది.ఈ కార్యక్రమానికి యాంకర్ గా శ్రీముఖి వ్యవహరించగా జడ్జిగా మొదటిసారి స్నేహ ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరొక గెస్ట్ గా శివ బాలాజీ వ్యవహరిస్తున్నారు.ఇక స్పెషల్ గెస్ట్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి వ్యవహరించనున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి పదిమంది బుల్లితెర జంటలను ఆహ్వానించి వారి చేత పలు టాస్కులను నిర్వహిస్తూ ఇందులో విజేతగా నిలిచిన వారు ఫైనల్కి వెళ్లి గ్రాండ్ ఫినాలే టైటిల్తో పాటు భారీ ప్రైజ్మనీని సొంతం చేసుకుంటారని తెలుస్తోంది ఏది ఏమైనా శ్రీముఖి వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.







