టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్నారు నాగచైతన్య.సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటూ ఉండగా కర్ణాటక ప్రభుత్వం ఈ సినిమా షూటింగుకు బ్రేకులు వేసింది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతుంది.
ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం కర్ణాటకలోని మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికారుల నుంచి షూటింగ్కి అనుమతులు తీసుకొని జరుపుతున్నారు అయితే భాగంగా చిత్ర బృందం ఒక వైన్ షాప్ సెట్ వేశారు.ఇలా వైన్ షాప్ సెట్ రాజగోపురాన్ని పోలి ఉండడంతో అక్కడి స్థానికులు ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ విధంగా స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి చిత్ర బృందం నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ సినిమా షూటింగుకు అనుమతులను రద్దు చేశారు.ఇక ప్రభుత్వం సినిమా షూటింగుకు బ్రేకులు వేయడంతో చేసేదేమి లేక చిత్ర బృందం తమ షూటింగ్ నిలిపి వేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి చిత్రబంధం ఇప్పటివరకు ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం.ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్నారు.ఈ సినిమాకు ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.







