విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ లో ఏడుగురు గల్లంతైయ్యారు.సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదశాత్తు గల్లంతు అయ్యారు.
వీరిలో ఆరుగురు విద్యార్థులు క్షేమంగా బయటకు వచ్చారు.మరో విద్యార్థి గల్లంతైయ్యాడు.
సమాచారం అందుకున్న గ్రామస్థులు ఘటనా స్థలికి చేరుకున్నారు.పోలీసులకు తెలిపినా గల్లంతైన విద్యార్థి కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టడం లేదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
కనీసం మృతదేహాన్ని అయినా అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా పోలీసులు, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.







