జమ్మూకశ్మీర్ లో రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది.షోపియాన్, పుల్వామాలో ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ క్రమంలో షోపియాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు.అయితే, షోపియాన్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబా కి చెందినవారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.
పుల్వామాలో హతమైన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించినట్టు తెలుస్తోంది.మృతుల్లో ఇద్దరు ఎల్ఇటి ఉగ్రవాదులను సజాద్ అహ్మద్ చక్, రాజా బాసిత్ యాకూబ్గా గుర్తించారు.
యువకులను ఉగ్రవాద గ్రూపులో ప్రేరేపించడంతో పాటు రిక్రూట్ చేయడంలో సజాద్ అహ్మద్ చాక్ కీలక పాత్ర పోషించాడని పోలీసులు స్పష్టం చేశారు.అనంతరం వారి నుంచి రెండు ఎకె సిరీస్ రైఫిళ్లు, నాలుగు ఎకె మ్యాగజైన్లు, 32 రౌండ్లతో సహా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.







