నా మనవళ్లు నన్ను తాత అని పిలవరు.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా త్వరలో ఈ షో సీజన్2 మొదలుకానున్న సంగతి తెలిసిందే.ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరు కానున్నారని ఇప్పటికే విడుదలైన ఫోటోల ద్వారా క్లారిటీ వచ్చింది.

 Star Hero Balakrishna Interesting Comments Goes Viral In Social Media , Balakris-TeluguStop.com

తాజాగా అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బయట నేను అన్ స్టాపబుల్ అని అయితే కుటుంబం విషయానికి వస్తే మాత్రం నా భార్య వసుంధర అన్ స్టాపబుల్ అని బాలయ్య కామెంట్లు చేయడం గమనార్హం.నా భార్య వసుంధర నన్ను భరిస్తోందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

వసుంధర నా కుటుంబాన్నీ లీడ్ చేస్తోందని బాలయ్య కామెంట్లు చేశారు.ఆస్పత్రి, సినిమాలకు సంబంధించి నేను విశ్రాంతి లేకుండా ఉంటే నా ఫ్యామిలీని వసుంధర లీడ్ చేస్తుందని బాలయ్య చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున అన్ స్టాపబుల్ సీజన్2 కు హాజరయ్యే ఛాన్స్ అయితే ఉందని బాలయ్య కామెంట్లు చేశారు.వాళ్ల సమయానికి అనుగుణంగా ఈ షోకు హాజరవుతారని బాలయ్య కామెంట్లు చేశారు.

తొలి సీజన్ తో పోల్చి చూస్తే సెకండ్ సీజన్ ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుందని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని బాలయ్య అన్నారు.బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చివర్లో యాంకర్ బాలయ్యను మావయ్య అని పిలవచ్చా? అని అడగగా నా ఇంట్లో నా మనవళ్లతోనే నేను తాతయ్యా అని పిలిపించుకోనని నా మనవళ్లు నన్ను బాలా అని పిలుస్తారని బాలయ్య అన్నారు.బాలయ్య వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube