గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరుస ఫ్లాప్ సినిమాలను చవి చూస్తూ ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది.అయితే బ్రహ్మాస్త్ర సినిమా కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీకి ఊరటనీచ్చిందని చెప్పాలి.
బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అన్ని భాషలలోనూ మంచి కలెక్షన్లను రాబట్టి ఏకంగా 400 కోట్ల క్లబ్లో చేరింది.ఇకపోతే ఈ సినిమాలో అమితాబచ్చన్ నాగార్జున వంటి సెలబ్రిటీలు కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ సినిమాని తెలుగులో దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల చేశారు.సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి విశేష స్పందన లభించింది.
ఇలా థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఇక ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఈ సినిమా విడుదల కావడంతో విడుదలైన నెల రోజులకే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాని అక్టోబర్ మూడవ వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకట వెలబడునున్నట్లు తెలుస్తోంది.థియేటర్లో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ విధమైనటువంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానునట్లు మనకు తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.