తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఎంపీలు నడిపే ఆసుపత్రులు, క్లినిక్లను మూసివేతకు రంగం సిద్ధం చేసింది.

ఈ మేరకు వాటిని మూసివేయాలంటూ డిఎం హెచ్ఓలను డిహెచ్ శ్రీనివాస్ రావు ఆదేశించారు.అదేవిధంగా రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు.గత నాలుగు రోజులుగా నిర్వహించిన తనిఖీలలో లైసెన్స్ లు లేని 81 ఆసుపత్రులు సీజ్ చేశామన్నారు.64 ఆసుపత్రులకు జరిమానాలు విధించామని వెల్లడించారు.నోటీసులకు రెండు వారాల్లోగా స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు