పాత నోట్ల రద్దుపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత ఈ రద్దుపై సుప్రీం ధర్మాసనం విచారణ జరపనుంది.నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఆ పిటిషన్లపై సుప్రీం ఇప్పుడు విచారణకు సిద్ధమైంది.జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదురుగు న్యాయమూర్తుల ధర్మాసనం రేపు విచారణ చేయనుంది.