తెలంగాణ కాంగ్రెస్పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైఎస్ఆర్ ఉన్నప్పుడే కాంగ్రెస్ ఉందని, ఇప్పుడేమీ లేదని చెప్పారు.వైఎస్ఆర్ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆమె ఆరోపించారు.30 ఏళ్లు ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుందన్నారు.అంతేకాకుండా రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ను పార్టీ అవమానించిందని విమర్శించారు.ఇప్పుడు కాంగ్రెస్కు భవిష్యత్ లేదన్న షర్మిల.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ దొంగ అంటూ ఆరోపించారు.నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికారని ఎద్దేవా చేశారు.







