అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేలుడు కలకలం సృష్టించింది.పెద్దవడుగూరు మండలం కొండేపల్లికి చెందిన నారాయణ స్వామి అనే వ్యక్తికి చెందిన క్వారీలో పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయలు కావడంతో.మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.
బాధితులు గోపరాజు పల్లెకి చెందిన నాగ పుల్లయ్య, కొండేపల్లికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు.