మధుపత్రి ఆకులు.వీటిని స్టీవియా ఆకులని కూడా పిలుస్తుంటారు.
చక్కెర కంటే ఎక్కువ తియ్యగా ఉండే మధుపత్రి ఆకుల్లో బోలెడన్ని ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా మధుపత్రి అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేధ నిపుణులు చెబుతుంటారు.
మరి మధు పత్రి ఆకులను ఎలా తీసుకోవాలి.? అసలు ఈ ఆకుల యొక్క ఆరోగ్య లాభాలు ఏంటీ.? వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం బారిన పడి నానా ఇబ్బందలనూ ఫేస్ చేస్తున్నారు.
అయితే షుగర్ వ్యాధి గ్రస్తులకు మధు పత్రి ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి.మధుపత్రి ఆకులను నీటితో శుభ్రంగా కడిగి.
నోటిలో వేసుకుని బాగా నమిలి తినాలి.లేదా షుగర్కు బదులుగా మధుపత్రి ఆకుల నుంచి రసాన్ని తీసుకుని వాడొచ్చు.
తద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.ఒక వేళ పెరిగినా అదుపులోకి వస్తాయి.
అలాగే రోజుకు మూడు నుంచి నాలుగు మధుపత్రి ఆకులను నమిలి తింటే గనుక.అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేసి సీజనల్ వ్యాధులు దరి చేరకుండా రక్షణ కల్పిస్తుంది.
అంతే కాదు, మధుపత్రి ఆకులను తింటే గనుక.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగ్గా మారి గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.మధుపత్రి ఆకులు తియ్యగా ఉనప్పటికీ.వాటిని తినడం వల్ల ఎటువంటి క్యాలరీలు శరీరంలోకి చేరవు.పైగా వాటిని బాగా నమిలి తింటే నోటి దుర్వాసన, నోటి పూత వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
.