ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి పది రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

స్నపనాభిషేకం అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తారు.కాగా, ఉదయం 9 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ అమ్మవారిని దర్శించుకుని తొలిపూజ నిర్వహించనున్నారు.

ఈ దసరా మహోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు.ఈ క్రమంలో భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు