పీఎఫ్ఐ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.జాతీయ దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాచారంతో పీఎఫ్ఐ ఫండ్స్ పై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విదేశీ ఫండ్స్, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించింది.పీఎఫ్ఐ కేసులో అరెస్ట్ అయిన నిందితుల అకౌంట్స్ ను అధికారులు పరిశీలిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో మొత్తం 45 మందిని అరెస్ట్ చేసిన ఈడీ.ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుంది.