విజయవాడలో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గొల్లపూడిలోని ఎన్టీఆర్ సర్కిల్ లో మాజీమంత్రి దేవినేని ఉమ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.దేవినేనిని అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అనంతరం దేవినేనితో పాటు పార్టీ కార్యకర్తలను భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.