అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి.జిల్లాలో కీలక నేతలైన జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయనే విషయం తెలిసిందే.జేసీ వర్గీయులు వేరు కుంపటి రాజకీయాలు చేస్తున్నారని ప్రభాకర్ చౌదరి వర్గం ఆరోపిస్తుంది.
ఈ నేపథ్యంలో జేసీ వర్గంలో ఐదుగురిపై వేటు వేయాలని తీర్మానించారు.దీంతో ప్రభాకర్ చౌదరి నిర్ణయంపై జేసీ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.







