అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచాలని పురుషోత్తం రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.
ఈ రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు కేంద్రం, ఈసీకి నోటీసులు జారీ చేసింది.
అనంతరం జమ్ముకశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ కు జత చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది.