అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‎పై సుప్రీంలో విచారణ

అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

 Hearing In The Supreme Court On The Petition Filed On The Increase Of Assembly S-TeluguStop.com

తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచాలని పురుషోత్తం రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.

ఈ రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు కేంద్రం, ఈసీకి నోటీసులు జారీ చేసింది.

అనంతరం జమ్ముకశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ కు జత చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube