సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్ లపై తిరుపతి కోర్టులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు విచారణలో ఉంది.2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.ఆయన తన కుమారులతో కలిసి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో తిరుపతి కోర్టులో సాగుతోన్న విచారణను నిలుపుదల చేయాలంటూ ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తిరుపతి కోర్టులో కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.







