నమీబియా నుండి భారత్కు వచ్చిన చిరుతలపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.ఇండియా జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.నిరుద్యోగంపై కూడా ప్రధాని దృష్టి సారించాలన్నారు.8 చిరుతలు వచ్చాయి, కానీ 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎందుకు రాలేదో అని ట్వీట్ చేశాడు.భారత్ జోడో యాత్ర ప్రచారం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ, దేశం నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పోరాడుతోందని, అయితే ప్రధానమంత్రి అడవిలో చిరుతలను విడిచిపెట్టడంలో బిజీగా ఉన్నారన్నారు.
ప్రధాని దేశ సమస్యలను పరిష్కరించడంలో తన సమయాన్ని వెచ్చించాలని, కానీ ఆయన చిరుతల ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారన్నారు.
భారత్లో అంతరించిన చిరుతలను తిరిగి తీసుకురావడం సంతోషమే కానీ మరీ లక్షలాది మంది నిరుద్యోగ యువతపై కూడా ప్రధాన మంత్రి దృష్టి సారించాలన్నారు.యువవోన్ కీ హై లాల్కర్, లే కర్ రహేంగే రోజ్గార్ ( ఉపాధి కావాలంటూ యువత ఆర్తనాదాలు), రాష్ట్రీయ బెరోజ్గర్ దివాస్ అనే హ్యాష్ట్యాగ్తో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు.
నమీబియా నుండి 8 చిరుతలు భారత గడ్డపై కాలు మోపాయి.దీంతో 70 ఏళ్ల నిరీక్షణకు శనివారంతో తెరపడింది.

30 – 66 నెలల వయస్సు గల ఈ చిరుతలను ప్రత్యేక విమానంలో నమీబియా నుండి భారత్కు తరలించారు.ఇందులో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కునో నేషనల్ పార్క్లోని చిరుతలను క్వారంటైన్ ఎన్క్లోజర్లో విడిచిపెట్టారు.ఈ చిరుత కునోలో పరుగెత్తితే, ఇక్కడ జీవవైవిధ్యం పెంచుతాయని తెలిపారు.అయితే చిరుతలను చూసేందుకు ఎవరూ రావద్దని, ఓపిక పట్టాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.ఈ చిరుతలు అతిథులుగా వచ్చాయి.
వాటికి ఈ ప్రాంతం గురించి తెలియదు.కునో అవి తమ ఇల్లుగా మార్చుకోవాలంటే, వాటికి సహకరించాలని అన్నారు.
.






