అక్కినేని హీరోల్లో నాగార్జున ఒకరు.ఈయన సీనియర్ హీరో అయినప్పటికీ తన కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు.హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవలే బంగార్రాజు సినిమాను తన కొడుకుతో కలిసి చేసి హిట్ అందుకున్నాడు.ఇక దసరా కు సోలోగా రాబోతున్నాడు.
ది ఘోస్ట్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ సినిమా కంటే ముందే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక నటించింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ విలన్ గా కనిపించింది.ఈమె తాజాగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొని నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఈయన ఈ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించారని.అప్పుడే ఆమెకు కూడా ఆయనతో పరిచయం ఏర్పడిందని.ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.
ఇంకా నాగార్జున సెట్ లో ఉంటే అమ్మాయిలంతా ఆయన చుట్టూనే ఉండేవారట.
సెట్ లో రణబీర్ కపూర్ ఉన్న కూడా నాగార్జున చుట్టూనే అమ్మాయిలు కనిపించే వారని ఆయనతో మాట్లాడేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వారని తెలిపింది.అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా సెట్ లో పోటీ పడి మరీ నాగ్ తో మాట్లాడేవారట.
మరి కింగ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా.







