మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మళ్లీ తెలుగులో బిజీ హీరోయిన్ అవబోతుంది.త్రివిక్రం అఆ.
నాగ చైతన్య ప్రేమం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అనుపమ యువ హీరోల సరసన నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంది.ఈమధ్య లుక్స్ పరంగా బాగుండాలని కంప్లీట్ గా స్లిమ్ అయిపోయిన అనుపమ ఇప్పుడు వరుస ఛాన్సులు అందుకుంటుంది.
అదీగాక నిఖిల్ తో చేసిన కార్తికేయ 2 సూపర్ హిట్ అవడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది.
ఈ క్రమంలో అనుపమ తన రెమ్యునరేషన్ కూడా పెంచిందని టాక్.
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సినిమాకి 60 నుంచి 75 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుండగా కార్తికేయ 2 హిట్ అవడంతో ఆమె రెమ్యునరేషన్ కోటి పైగా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.అనుపమ రేంజ్ కి ఈ పాటికి 2 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకోవాల్సింది కానీ మధ్యలో ఫ్లాపుల వల్ల అమ్మడు వెనక్కి తగ్గింది.
కార్తికేయ 2 తో అనుపమకి మళ్లీ లక్ కలిసి వచ్చింది.ప్రస్తుతం రవితేజతో ఓ సినిమాకు సైన్ చేసింది అనుపమ.
కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్ లో రవితేజ చేస్తున్న ఈగల్ సినిమాకు అనుపమ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.