వరుస సినిమాలతో అనసూయ వెరీ బిజీ.. ఆ సినిమాతో ఆమె స్థాయే వేరు?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం అనసూయ వెండి తెరపై వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.అనసూయ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం దర్జా.

ఈ సినిమా ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయింది.అనసూయ చేతిలో ప్రస్తుతం పుష్ప 2 సినిమా ఉన్న విషయం తెలిసిందే.

పుష్ప 2 లో అనసూయ పాత్రను చాలా కీలకంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్.ఇందులో దక్షాయణి పాత్ర ఆమెకు కెరీర్‌ బెస్ట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Advertisement

అలాగే అనసూయ దర్శకుడు శివ ప్రసాద్‌ దర్శకత్వంలో విమానం అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తోంది.ఈ సినిమా కూడా అనసూయకు మరింత గుర్తింపు వచ్చి పెడుతుంది మూవీ మేకర్స్ చెబుతున్నారు.

ఇందులో అనసూయతో పాటు సముద్రఖని, ధనరాజ్‌ కూడా నటించబోతున్నట్లు సమాచారం.అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండ సినిమాలో కూడా అనసూయ ఒక పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

కృష్ణవంశీ సినిమాలో ఆర్టిస్‌ల పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆయన సినిమాల్లో పాత్రలను చూపించే తీరు అలా ఉంటుంది.అయితే సినిమా అయినా కాకపోయినా ఆయన దర్శకత్వంలో ఒక సినిమాలో అయిన నటించాలి అని కోరుకుంటూ ఉంటారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అనసూయకి ఆ ఛాన్స్‌ వచ్చింది.ఇందులో కూడా అనసూయ నటన పీక్స్‌లో ఉంటుంది అని కూడా తెలిసింది.

Advertisement

అనసూయకి మంచి పేరు తెచ్చే చిత్రాలని మున్ముందు రానున్నాయి.

తాజా వార్తలు