షిర్డీ సాయిబాబా సంస్థాన్ ధర్మకర్తల బోర్డును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది.మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఈ బోర్డును నియమించారు.
అదేవిధంగా వచ్చే ఎనిమిది వారాల్లోగా నూతన ధర్మకర్తల మండలిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనల మేరకు ధర్మకర్తల మండలిని నియమించలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లను విచారించిన ఔరంగాబాద్ బెంచ్ తీర్పును వెలువరించింది.







