సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రం తో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది.2023 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు మహేష్.
మహేష్, జక్కన్న మూవీ అదిరిపోతుందని చెప్పొచ్చు.ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.
కె.ఎల్ నారాయణన్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల దాకా ఉంటుందని టాక్.ఈ సినిమాతో మహేష్ పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగతో సినిమా చేస్తాడని అంటున్నారు.
అంతకుముందే ఈ కాంబోలో సినిమా డిస్కషన్స్ లో వచ్చినా ఎందుకో లేట్ అయ్యింది.ఫైనల్ గా రాజమౌళి సినిమా తర్వాత సందీప్ తో అయితే పర్ఫెక్ట్ అని మహేష్ ఫీల్ అవుతున్నాడు.
అందుకే దాదాపు ఈ కాంబో ఫిక్స్ అయిందని అంటున్నారు.అయితే ఈ కాంబో మూవీ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడే చెప్పలేం.ఇక అర్జున్ రెడ్డి తర్వాత అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు సందీప్ వంగ.ఇప్పుడు అక్కడే యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు.








