యాదాద్రి జిల్లా:బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో వైద్యం పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్ కు విజ్ఞప్తి చేశారు.ఆదివారం బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ సందర్శించడానికి వచ్చిన ఆమెను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం వారు మాట్లాడుతూ బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.ఈ ప్రాంత ప్రజలు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయంలో వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ,ఉస్మానియా హాస్పటల్ లోకి వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్యతో రెండు గంటలు సమయం పడుతున్నందున చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించామన్నారు.







