పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా మార్చి 11న రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ముందు నుండి భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది అనే చెప్పాలి.
క్లారిటీ లోపించడంతో ఈ సినిమా థియేటర్ లో ఘోరంగా విఫలం అయ్యింది.యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.ఈ సినిమాతో యూవీ వారికీ గట్టిగానే పడింది.ఏకంగా 70-80 కోట్ల నష్టాలను మిగిల్చిందని వార్తలు వచ్చాయి.
పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ అసలు ఇలాంటి ఒక సినిమా ఎలా చేసాడు అని ఆయన ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్లాప్ అయినా ప్రభాస్ లుక్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టు కున్నాయి.
తాజాగా ఈయనకు సంబందించిన అన్ సీన్ పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ పిక్ తో మళ్ళీ రాధే శ్యామ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సమయంలో డార్లింగ్ ప్రభాస్ తన మేకప్ ఆర్టిస్ట్ తో కలిసి దిగిన క్లాసీ లుక్ ఆయన ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు

.ఈ ఫోటో ఫ్యాన్స్ మెచ్చడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేసారు.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.
దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు.







