మునుగోడు ఉపఎన్నిక పదవి కోసం వచ్చింది కాదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.ప్రజాస్వామ్యం కోసం వచ్చిన ఎన్నికని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినట్లుగానే.ఇప్పుడు తెలంగాణను కేసీఆర్ కుటుంబ పాలన నుండి కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ యజ్ఞంలో ప్రజలందరూ ధర్మం వైపు నిలవాలని ఆయన కోరారు.అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామన్న కోమటిరెడ్డి.
మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







