1.ప్రవాసీ తెలుగు మహిళల సమస్యలపై భారత ఎంబసీ ఆధ్వర్యంలో చర్చలు
సౌదీ అరేబియాలో ఉపాధి నిమిత్తం వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల మహిళల సమస్యలకు సంబంధించి రియాద్ లోని భారతీయ ఎంబసీ గురువారం ప్రప్రథమంగా ఒక ఒక తెలుగు ప్రవాసీ తెలుగు మహిళతో చర్చించింది.
2.సింగపూర్ లో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ ( సింగపూర్ ) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు.
3.తెరుచుకున్న 133 ప్రవాస పాఠశాలలు
ఆదివారంతో కువైట్ లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది.దీంతో దేశంలోని 133 ప్రవాస పాఠశాలలు తెరుచుకున్నాయి.
4.భార్యపై రిషి సునక్ ఆసక్తికర వ్యాఖ్యలు
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునక్ తన భార్య అక్షర మూర్తి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ పొట్టి కుర్రవాడి కోసం అప్పట్లో నువ్వు హై హిల్స్ వేసుకోవడం మానేసావు అంటూ చమత్కరించారు.
5.పాకిస్తాన్ లో ఇబ్బందికర పరిస్థితులు
ఒకవైపు వరదలు మరోవైపు అంటువ్యాధులతో పాకిస్తాన్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
6.దావూద్ పాకిస్థాన్ లో ఉన్నాడు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడని అతని సోదరుడు ఇక్బాల్ కస్కర్ తెలిపారు.
7.చైనా డ్రోన్ ను పేల్చేసిన తైవాన్
చైనా తైవాన్ దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.తైవాన్ గగన తలం లోకి వచ్చిన చైనా డ్రోన్ ను తైవాన్ పేల్చివేసింది.
8.ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ మృతి
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబ్ కు చెందిన ప్రముఖ సింగర్ నిర్వేయిల్ సింగ్ మృతి చెందాడు.
9.దావూద్ ఇబ్రహీం ను పట్టిస్తే నజరానా
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టిస్తే 25 లక్షల రూపాయల నజరానా ఇస్తామని ఎన్.ఐ ఏ ప్రకటించింది.
.