తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ఈ క్రమంలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు.బాధితులను పరామర్శించకుండా సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లడం సరైనది కాదని వ్యాఖ్యనించారు.
రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా బీహార్, పంజాబ్ లలో డబ్బులు పంచడం అన్యాయమన్నారు.ఆపరేషన్ వికటించి చనిపోయిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.