తెలంగాణ‌లో ఇదే మొద‌టిసారిః హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు

తెలంగాణ ఏర్పాటైన త‌ర్వాత కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేషన్లు విక‌టించి మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం ఇదే తొలిసార‌ని హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు అన్నారు.ఈ ప్ర‌క్రియ ఒక్క తెలంగాణ‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిర్వ‌హిస్తారని తెలిపారు.

 This Is The First Time In Telangana: Health Director Srinivasarao-TeluguStop.com

ఇబ్ర‌హీంప‌ట్న‌లో ఆప‌రేష‌న్లు చేసిన డాక్ట‌ర్ చాలా అనుభ‌వ‌శాలన్న ఆయ‌న‌.ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వైద్యాధికారుల‌పై సస్పెన్ష‌న్ వేటు వేశామ‌ని వెల్ల‌డించారు.

మ‌ర‌ణాల‌కు గ‌ల కారణాలు తెలుసుకునేందుకు న‌లుగురికి పోస్టుమార్టం నిర్వ‌హించామ‌న్నారు.మిగ‌తా 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని తెలిపారు.అనంత‌రం మృతుల కుటుంబ‌స‌భ్యుల‌కు రూ.5 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియో, డ‌బుల్ బెడ్ రూం ఇల్లుతో పాటు వారి పిల్ల‌ల చ‌దువుల‌కు ప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.అదేవిధంగా ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube