కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది.సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాంనబీ ఆజాద్ పార్టీని వీడారు.
ఈ క్రమంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ఇచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు.
పార్టీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే.ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అనంతరం రాహుల్ గాంధీపై ఆజాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్ష పదవి చేపట్టాక.
పార్టీలో ఉన్న సంప్రదింపుల వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందని మండిపడ్డారు.కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను మీడియా ముఖంగా చించివేయడం అతని అపరిపక్వతను బయట పెట్టిందని ఎద్దేవా చేశారు.
సీనియర్ నేతలను పక్కన పెట్టి కొత్త కోటరికి పార్టీ వ్యవహారాలను అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా పార్టీలో ప్రస్తుతం రిమోట్ కంట్రోల్ మోడల్ కొనసాగుతోందని దుయ్యబట్టారు.