మహ్మాద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తోందన్నారు.
బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు.లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానమని విమర్శించారు.
ఇస్లాంకు, మహ్మాద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదని చెప్పారు.