నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ‘బింబిసార’. ఈ సినిమాను యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడితెరకెక్కించారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.
అలాగే టాలీవుడ్ కష్టకాలంలో ఉండగా ఆ పరిస్థితులను మార్చి మళ్ళీ బాక్సాఫీస్ కళకళ లాడేలా చేయడంలో బింబిసార కూడా తోడ్పడింది.ఆగష్టు మొదటి వారం వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
జులై నెల మొత్తం బాక్సాఫీస్ వెలవెల బోయింది.వరుస ప్లాప్స్ తో సందడి లేకుండా పోయింది.
మరి అలాంటి సమయం లోనే బింబిసార కూడా రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో బ్లాక్ బస్టర్ హిట్ చేసారు.
ఈ సినిమా వసూళ్ల పరంగా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆశ్చర్య పరిచింది.

రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న ఇప్పటికి థియేటర్స్ లో డీసెంట్ రన్ కనబరుస్తూ మంచి వసూళ్లు సాధిస్తుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ గురించి సమాచారం బయటకు వచ్చింది.
ఈ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 దక్కించు కున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ కు అయితే ఇంకా కొద్దీ సమయం ఉంది.ఎందుకంటే టాలీవుడ్ సినీ పెద్దలు అందరు కలిసి 8 వారాల తర్వాతనే ఓటిటిలో రిలీజ్ చేయాలనీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీంతో బింబిసార సినిమా 50 రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇదీ ఒకందుకు మంచిదే అని చెప్పాలి.







