యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా ను కలవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే.అసలు ఎన్టీఆర్ ను అమిత్ షా ఎందుకు కలిశాడు.
అమిత్ షా అడిగిన వెంటనే ఎన్టీఆర్ కూడా ఎందుకు కలిసేందుకు ఓకే చెప్పాడు అనేది చర్చనీయాంశంగా మారింది.రోజంతా ఆ విషయం గురించి పతాక స్థాయిలో చర్చ జరిగింది.
ఎప్పడైతే ఎన్టీఆర్ మరియు అమిత్ షా లు కలిశారో అప్పుడు కొత్త చర్చ మొదలు అయ్యింది.అమిత్ షా తో కలిసిన సందర్బంగా ఎన్టీఆర్ గుబురు గడ్డం తో కనిపించాడు.
ఆ మధ్య బింబిసార సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో పాల్గొన్న సమయంలో నే ఎన్టీఆర్ గడ్డం చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు.ఇప్పుడు అంతకు మించిన గడ్డం తో ఎన్టీఆర్ కనిపించడంతో అభిమానులు ఎందుకు ఇంత గడ్డం ను ఎన్టీఆర్ పెంచుతున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇంత గడ్డం ను పెంచాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ కాస్త లావు అవ్వడం తో పాటు గడ్డం ను ఇంతగా పెంచడం తో చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ యొక్క తీరు ఏంటో అర్థం కావడం లేదు అంటూ అభిమానుల్లో వింత చర్చ జరుగుతోంది.హీరోగా ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మొదలు అవ్వాల్సి ఉంది.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాని కారణంగా ఎన్టీఆర్ సినిమా మరో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.కనుక అప్పటి వరకు ఇలా గడ్డం తోనే ఉంటాడా అంటూ చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ యొక్క గడ్డం పెంచుతున్న విషయం లో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటూ కథనాలు అల్లేస్తున్నారు.అసలు విషయం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.