ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా వ్యవహరించిన మొదటి సినిమా సాక్షి. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయనిర్మల కలిసిన నటించారు.
ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ జంట ఆ తర్వాత రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా దంపతులుగా మారారు. కృష్ణ విజయనిర్మల అను 19609లో పెళ్లి చేసుకున్నాడు.
కాగా వీరిద్దరికి కూడా ఇది రెండవ వివాహం.ఇది ఇలా ఉంటే సినిమాలలో నటిస్తూ ప్రేమించుకుంటూ ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో ఒక్కటైనా కృష్ణ, విజయనిర్మల.
కృష్ణ కుటుంబాన్ని ఏ విధంగా విజయనిర్మల ఒప్పించింది అన్న ప్రశ్నకు ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
తెలుగు ప్రేక్షకులకు మొదటి నుంచి మా ఇద్దరి జంట అంతే చాలా ఇష్టం.అలా కృష్ణ ఫ్యామిలీ కూడా మా ఇద్దరి ప్రేమను అంగీకరించారు.
ఆ తర్వాత వాళ్లు మా ఇంట్లోనే ఉన్నారు.పెళ్లి అయిన తర్వాత కూడా షూటింగ్ కి వెళ్లే ముందు మా అత్తమామలకు వంట చేసి పెట్టి వెళ్లే దాన్ని అని చెప్పుకొచ్చింది విజయనిర్మల.
మా అత్తమామలు నా చేతి వంటను ఎంతో ఇష్టపడేవారు.అంతేకాకుండా మా అత్తయ్య చనిపోయే చివరి ముందు కూడా నేను చేసిన బెండకాయ కూర రసం తిన్నారు ఇక అదే ఆమెకు చివరిసారి అయ్యింది అని తెలిపింది విజయనిర్మల.

అయితే కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చిన తర్వాత విజయనిర్మల, కృష్ణని డైరెక్ట్ చేస్తానని చెప్పగా అప్పుడు కృష్ణ ఆర్టిస్టుగా వంద సినిమాలు పూర్తి చేయు ఆ తరువాత నాకు నచ్చినట్టుగా చేయమని చెప్పాడట.కృష్ణ మాట మేరకు విజయనిర్మల కూడా తెలుగు తమిళం మలయాళం సినిమాలలో నటించిందట.అలా దాదాపుగా 80 సినిమాలు పూర్తి అయిన తర్వాత డైరెక్టర్ మారాను.మొదట మలయాళం లో ఒక సినిమాను డైరెక్టర్ చేసిన తర్వాత తెలుగులో మీనా నవల ఆధారంగా కృష్ణ గారితో ఒక సినిమాను తీశాను అది కూడా చాలా సక్సెస్ అయ్యింది అని తెలిపింది విజయనిర్మల.







