దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాక్సీ సేవలను ప్రవేశపెట్టింది కేరళ ప్రభుత్వం.ఈ క్రమంలో రాజధాని తిరువనంతపురంలో కేరళ సవారీ పేరిట ఈ సేవలను సీఎం పినరయి విజయన్ ప్రారంభించారు.
నూతన సరళీకరణ విధానాలు సంప్రదాయ కార్మిక రంగాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి.ఇటువంటి తరుణంలో మోటారు కార్మికులను ఆదుకునేందుకు కార్మిక శాఖ ఆలోచించి అమలు చేస్తున్న ప్రాజెక్ట్ అని వ్యాఖ్యనించారు.
కేరళ సవారీ సేవలతో ప్రయాణికులతో పాటు డ్రైవర్లకు మేలు జరుగుతుందంటూ.కేరళ మోడల్ మళ్లీ మెరిసిందని పేర్కొన్నారు.
తిరువనంతపురం మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.క్రమంగా కేరళ సవారీ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.